హస్తం గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే..? కంటతడి పెట్టుకున్న కాంగ్రెస్ మహిళా నేత

byసూర్య | Tue, Jun 18, 2024, 07:54 PM

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి ముగిసింది. దీంతో పలువురు నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై దృష్టి సారించారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకోవటంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పక్క పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా.. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హస్తం గూటికి చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృష్ణమోహన్ రెడ్డి సన్నిహితుడిగా ఉండేవారు. గతంలో ఇద్దరూ ఒకే పార్టీలో పని చేశారు.


ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై జూపల్లితో చర్చించినట్లు తెలిసింది. అనుచరులు, కార్యకర్తల ఒత్తడి మేరకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లటమే ఉత్తమమని బండ్ల భావిస్తున్నారట. అయితే పార్టీలో చేరటంపై ఆయన కొన్ని షరతులు పెట్టినట్లు తెలిసింది. అవి సఫలం అయితే ఆయన కాంగ్రెస్‌లో చేరటం ఖాయమని సన్నిహితులు అంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లా. ఇక్కడు మెుత్తం 14 అసెంబ్లీ స్థానాలకు గాను 12 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. గద్వాల, అలంపూర్ మాత్రమే బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లాయి. గద్వాలలో బండ్ల, అలంపూర్‌లో విజయుడు గెలుపొందారు. ఈ నేపథ్యంలో సీఎం జిల్లాలో పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు ఇద్దరు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని హస్తం నేతలు కూడా భావిస్తున్నారని సమాచారం.


ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమి, ఎంపీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ నుంచి బీజేపీ అభ్యర్థి డీకె అరుణ గెలవటంతో రేవంత్‌ రెడ్డిని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు ఓ అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టిన రేవంత్.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు స్కెచ్ వేసినట్లు తెలిసింది. ఇప్పటికే పార్టీ మారేందుకు బండ్ల సిద్ధంగా ఉండగా.. ఎమ్మెల్యే విజయుడితోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి గద్వాల ఎమ్మెల్యే విషయంలో క్లారిటీ రాగా.. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన గద్వాల జడ్పీ ఛైర్‌పర్స్ సరిత తిరుపతయ్య వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలిసింది.


బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తే తన భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని ఆమె ఆవేదన చెందుతున్నారట. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఇంటికి ఆమె తన అనుచరులతో కలిసి వెళ్లి మాట్లాడారు. తన భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని కంటతడి పెట్టుకున్నారు. తాజాగా.. సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే రేవంత్‌ను కలిసి తన రాజకీయ భవిష్యత్తుపై భరోసా కోరేందుకు సరిత యత్నిస్తున్నారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM