byసూర్య | Mon, Jun 17, 2024, 12:10 PM
బూర్గంపాడు మండలం మణుగూరు క్రాస్ రోడ్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పాల్వంచ నుంచి భద్రాచలం వస్తున్న ఆటో, ఎదురుగా వస్తున్న టూవీలర్ వేగంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో మోటార్ సైకిలిస్ట్ తీవ్రగాయాలతో రోడ్డుపై పడిపోగా, ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి కూడా తీవ్రగాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న మోటార్ సైకిలిస్ట్, గాయపడిన ప్రయాణికులను భద్రాచ ఏరియా ఆస్పత్రికి తరలించారు.