byసూర్య | Mon, Jun 17, 2024, 12:35 PM
బక్రీద్ పండుగ సందర్భంగా సోమవారం పూడూరు మండల కేంద్రంలో ముస్లిం సోదరులను సెన్సార్ బోర్డు సభ్యులు మల్లేష్ పటేల్ కలిసి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూడూరు మండల యువమోర్చా అధ్యక్షులు పాండు, పూడూరు మండల భాజపా ఉపాధ్యక్షులు శ్రీశైలం, నాయకులు సుభాన్ , సత్యనారాయణ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.