byసూర్య | Mon, Jun 17, 2024, 11:42 AM
విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే ను కలిసి శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణుల ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అద్యక్షులు అజయ్ కుమార్, విశ్వకర్మ సంఘం రాష్ట్ర ఉపాద్యక్షులు కిష్టయ్య, జిల్లా అదిక్షులు నర్సిములు, ప్రధాన కార్యదర్శ స్వామి, కోశాధికారి దశరథ్ తదితరులు పాల్గొన్నారు