byసూర్య | Mon, Jun 17, 2024, 11:33 AM
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చందపల్లి సమీపంలోని ఈద్గా వద్ద సోమవారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు ముస్లిం సోదరులను కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బక్రీద్ పండుగను నిజమైన స్ఫూర్తితో జరుపుకోవడం వల్ల సమాజంలో శాంతి, సామరస్యం, కరుణ, ఐక్యత నెలకొంటాయని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.