byసూర్య | Mon, Jun 17, 2024, 11:31 AM
గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 5ఇంక్లైన్ ఈద్గా ను సోమవారం సీపీ ఎం శ్రీనివాస్ సందర్శించి బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులకు సీపీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. భక్తికి, త్యాగానికి బక్రీద్ ప్రతీకగా నిలుస్తుందని, దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. ఏసిపిలు ఎం రమేష్, నరసింహులు, సిఐ ఇంద్రసేనారెడ్డి, రవీందర్ లు ఉన్నారు.