byసూర్య | Mon, Jun 17, 2024, 11:00 AM
మహబూబాబాద్ కేసముద్రం మండలం సోమవారం పెనుగొండ శివారు లక్ష్మిపురం వెళ్ళే మార్గంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వంశీధర్ వెల్లడించారు.