byసూర్య | Mon, Jun 17, 2024, 11:05 AM
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ప్రముఖ పుణ్య క్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల తాకిడి నెలకొంది. ఆదివారం సెలవు కావడంతో ఆలయానికి చేరుకున్న భక్తులు వేకువజామున లేచి కోనేరులో పవిత్ర స్నానం ఆచరించి క్యూలైన్లో నిలిచి స్వామివారిని దర్శించుకున్నారు. రేగు చెట్టు వద్ద, మహామండపంలో పట్నాలు వేసి, కేశ కండన, అభిషేకం, అర్చన, కళ్యాణం, రేగు చెట్టుకు ముడుపులు కట్టే ముక్కలు చెల్లించుకున్నారు.