byసూర్య | Tue, May 28, 2024, 11:35 AM
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా మంగళవారం నారాయణపేట పట్టణంలో టిడిపి నాయకులు విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అంతకుముందు సద్గురు అవధూత మఠంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు ఓంప్రకాశ్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా 150 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించామని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.