హైదరాబాద్ బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కొత్తగా డీలక్స్‌ బస్సులు, లగ్జరీ ప్రయాణం

byసూర్య | Sat, May 25, 2024, 08:38 PM

మహాలక్ష్మీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఫ్రీ బస్సులను ఉపయోగించుకుంటున్నారు. దీంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. టికెట్ కొనుక్కొని ప్రయాణించేవారికి సీటు కూడా దొరకటం లేదు. హైదరాబాద్‌లో అయితే.. చాలా దూరం వరకు నిల్చొనే ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.


ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్‌లో కొత్త బస్సులు నడుపుతోంది ఆర్టీసీ. 25 ఎలక్ట్రిక్ ఏసీ, 25 నాన్ ఎసీ ఎలక్ట్రిక్ బస్సులు నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మరో 450 ఎలక్ట్రిక్ బస్సులు జులై చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఇక ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందు కోసం ప్రత్యేకంగా 125 డీలక్స్ బస్సులను నడపాలని డిసైడ్ అయింది. ఈ బస్సులు కూడా జులైలోనే ప్రయాణికులకు అందుబాటులో రానున్నాయి.


హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రధాన రూట్లలో ఈ డీలక్స్‌ బస్సులు నడపనున్నారు. ప్రస్తుతం సిటీ, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణాలు కొనసాగుతున్నాయి. అయితే సౌకర్యవంతంగా వెళ్లాలనుకునే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని కొత్త డీలక్స్ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ బస్సుల్లో ప్రయాణించే వారందరూ టిక్కెట్‌ తీసుకోవాల్సిందేనని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM