కారు డోర్ లాక్ ,,,,ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతి

byసూర్య | Wed, May 22, 2024, 05:00 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయి గూడెంలో విషాదం చోటుచేసుకుంది. పార్కింగ్ చేసిన కారులో ఊపిరాడక ఓ చిన్నారి మృతి చెందింది. కార్ డోర్స్ ఆటోలాక్ కావటంతో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో చిన్నారి కుటుంబంలో తీవ్రవ విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సాంబాయి గూడెం గ్రామానికి చెందిన సాయి కుమార్, లిఖిత దంపతులు. వీరికి మూడేళ్ల వయస్సున్న కల్మిషా సంతానం. అయితే మంగళవారం సరదాగా ఇంటి ఆవరణలో ఆడుకుంటూ పార్కింగ్ చేసి పెట్టిన తమ కారు ఎక్కింది.


చిన్నారి కారు ఎక్కగానే.. ఆటోమేటిక్‌గా కార్ డోర్స్ లాక్ అయ్యాయి. పాప ఎక్కడో ఆడుకుంటుంది అనుకుని తల్లిదండ్రులు లైట్ తీసుకున్నారు. ఎంత సేపటికి పాప కనిపించకపోవటంతో కారు డోర్ ఓపెన్ చేసి చూశారు. పాప అపస్మారకస్థితిలో కారులో పడిపోవటం చూసి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే మణుగూరులోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చిన్నారి మృతి చెందిందని డాక్టర్లు వెల్లడించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చిన్నారి మృతితో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM