byసూర్య | Wed, May 22, 2024, 04:46 PM
హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై ఓ ర్యాపిడో డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితున్ని అరెస్ట్ చేయగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సెలవుల సీజన్ నడుస్తుండటంతో.. చాలా మంది పిల్లలు ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈ క్రమంలోనే.. సికింద్రాబాద్కు చెందిన 16 ఏళ్ల బాలిక.. గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతూనే ఉండగా.. ఆమె తల్లిదండ్రులు మందలించారు. ఆమాత్రానికే.. అలిగిన ఆ బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చేదింది.
ఒంటరిగా రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న బాలికను గమనించిన ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డి.. ఆమెను పలకిరించాడు. ఆమె బాధలో ఉన్నది గమనించి.. అదే అలుసుగా మెల్లిగా మాట కలిపాడు. నాలుగు ఓదార్పు మాటలు చెప్పేసరికి.. ఆమెకు కొంత సాంత్వన దొరికినట్టయింది. దీంతో.. సందీప్ రెడ్డిని ఆ బాలిక నమ్మింది. రోడ్డుపై ఒంటరిగా వెళ్లడం మంచిది కాదని.. నీ కోపం తగ్గేవరకు తను ఓ సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తానని చెప్పటంతో.. సందీప్ రెడ్డి మీద మరింత నమ్మకం కుదిరింది. సందీప్ రెడ్డి మాటల్లోని దురుద్దేశం తెలుసుకోలేకపోయిన బాలిక.. బైక్ ఎక్కింది. దీంతో.. ఆమెను కాచిగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు సందీప్ రెడ్డి. తీరా లాడ్జ్కి తీసుకెళ్లిన సందీప్ రెడ్డి.. అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
అత్యాచారం చేసిన సందీప్ రెడ్డి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో.. ఆ బాలిక ఏడుస్తూ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడిపై పోక్సోతో పాటు పలు కేసులు నమోదుచేశారు.
ప్రస్తుతం.. నగరంలో ఎక్కడికి వెళ్లాలన్న ప్రజా రవాణా వ్యవస్థలు ఎన్ని ఉన్నా.. ర్యాపిడో, ఓలా, ఉబర్ లాంటి సంస్థల సేవలను చాలా ఉపయోగించుకుంటున్నారు. తక్కువ ధరలతో.. క్షణాల్లోనే ఉన్న చోటికే బైకులు, ఆటోలు వస్తుండటం.. అడుగు వేయాల్సిన పని లేకుండా గమ్యస్థానాలకు తీసుకెళ్తుండటంతో.. అందరూ వాటి వైపే ఆకర్షితులవుతున్నాయి. ఇదంతా ఒకఎత్తయితే.. కొందరు మాత్రం ఒంటరిగా కనిపించిన ఆడవాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, అత్యాచారాలకు పాల్పడుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.