byసూర్య | Tue, May 07, 2024, 10:46 AM
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం పానగల్ మండలం బుసిరెడ్డిపల్లిలో ముఖ్యనేతల సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ప్రజలకు సంక్షేమం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో నాయకులు, కార్యకర్తలు శ్రమించాలన్నారు.