byసూర్య | Tue, May 07, 2024, 10:45 AM
వందే భారత్ రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు. భువనగిరి-పగిడిపల్లి రైల్వే లైన్ మధ్యలో పట్టాలపై వందే భారత్ రైలు కింద పడి రాత్రి ఓ గుర్తుతెలియని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. మృతుడు సుమారు 35 ఏళ్లు ఉంటాడని, ఎవరికైనా ఆచూకీ తెలిసినట్లయితే 8712568454, 8712658719 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.