byసూర్య | Mon, May 06, 2024, 03:25 PM
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని పెద్ద వాగు పై నిర్మించిన వంతెనను త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని, అయిజ పులికల్ రహదారిని మరమ్మతు చేయాలని సోమవారం అయిజ కు చెందిన అఖిలపక్ష కమిటీ నాయకులు గద్వాలలోని కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యాలయ ఏవో భద్రప్పకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, ఎమ్మార్పీఎస్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.