byసూర్య | Mon, May 06, 2024, 03:22 PM
భారతీయ జనతా పార్టీ పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపు పాలమూరు అభివృద్ధికు ఎంతో ముఖ్యమని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని భరత్ నగర్ అంబేద్కర్ నగర్ కాలనీలలో సోమవారం బిజెపి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కర్నే స్వామి, దేవరింటి నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, సుకన్య శేఖర్, కొలిమి ఆంజనేయులు, కార్యకర్తలు పాల్గొన్నారు.