byసూర్య | Mon, May 06, 2024, 03:15 PM
మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం వెంకటగిరి గ్రామంలో సోమవారం బీజేపీ నాయకులు లోకసభ ఎన్నికల సందర్భంగా ఇంటింటికి తిరిగి బీజేపీకి ఓటు వేయాలని ప్రచారం చేశారు. అలాగే ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి మజ్జిగ పంపిణీ చేశారు. నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణమ్మ ను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.