byసూర్య | Mon, May 06, 2024, 03:07 PM
నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్ లో సత్యసాయి సేవ సమితి అద్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో సోమవారం జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి కృష్ణమాచారి ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. అంతకుముందు సాయిబాబా చిత్రపటానికి పూజలు చేశారు. ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని, సేవ సమితి సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.