byసూర్య | Mon, May 06, 2024, 03:03 PM
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం పరిధిలోని తిరుమలగిరి గ్రామంలో సోమవారం ఎఐటియూసి రచించిన 32 పేజీల అవినీతిలో కూరుకుపోయిన బిజెపి అనే పుస్తకాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎఐటియూసి జిల్లా కార్యదర్శి మారేడు శివశంకర్, సిపిఐ జిల్లా నాయకుడు చిలువేరు శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.