byసూర్య | Mon, May 06, 2024, 03:00 PM
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని పెద్దవాగుపై నిర్మించిన వంతెనను త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని అఖిల పక్ష కమిటీ నాయకులు సోమవారం అయిజ నుంచి గద్వాలకు తరలి వెళ్లారు. వంతెన వద్ద కేవలం అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో జాప్యం కారణంగా ఇంతవరకు ప్రారంభించలేదు. గద్వాలలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సంతోష్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.