byసూర్య | Mon, May 06, 2024, 02:58 PM
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం పరిధిలోని తిరుమలగిరి గ్రామంలో సోమవారం పలువురు బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మత్స్య సహకార సంఘం చైర్మన్ కటికర్ల గోపాల్, ఎం. సత్యం, గుమ్మడి పద్మ, పొలం శ్రీశైలం, పోలం పుల్లయ్య, వెంకటయ్య, మూడవత్ రాము, శ్రీకాంత్, మాదాపురం రాజు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.