byసూర్య | Mon, May 06, 2024, 02:56 PM
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి సర్పంచ్ సుజాత తేజ వర్ధన్, ఉపసర్పంచ్ భాస్కర్, జనంపల్లి ఎంపీటీసీ రాధాకృష్ణ కలసి 100మందితో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. నాగర్ కర్నూల్ అభ్యర్థి మల్లు రవిని అత్యధిక మెజారిటీ గెలిపిస్థామన్నారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.