byసూర్య | Mon, May 06, 2024, 02:54 PM
నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ ను ఎంపీగా గెలిపించడమే లక్ష్యంగా ప్రతి గ్రామంలో ఒక గంట (హర్ ఘావ్ ఏక్ గంట ) కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం ఉట్కూర్ మండలం మల్లేపల్లి నాగిరెడ్డిపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాయకులు బాలకృష్ణ రెడ్డి సూర్య ప్రకాశ్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.