byసూర్య | Thu, May 02, 2024, 01:32 PM
దేశంలో గడిచిన పదేళ్లలో అవినీతి లేని పాలన అందించిన ఘనత ప్రధాని మోడీదేనని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీదేవి రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని సంతోషిమాత కాలనీలో నిర్వహించిన కార్నర్ మీటింగులో ఆమె మాట్లాడారు. నల్గొండ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాములు, నరసింహ, వెంకటేష్, శంకర్, భాస్కర్, రవి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.