byసూర్య | Thu, May 02, 2024, 01:38 PM
ఈ వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పి చందనా దీప్తి తెలిపారు. ముఖ్యంగా పిల్లలు వృద్ధులు, బయటకు వెళ్ళకుండా ఉండే విధంగా ఉండాలని కోరారు. బయటకి 'వెళ్లి వచ్చిన తరువాత నీరసంగా అనిపించడం, ఒళ్లంతా వేడి కావడం, తలనొప్పి, వాంతులు, విరేచనాల వంటి లక్షణాలు కనబడితే తక్షణమే చక్కర, ఉప్పు ద్రావణాన్ని తాగాలన్నారు.