byసూర్య | Mon, Apr 29, 2024, 01:16 PM
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల భారాస నాయకులు, కార్యకర్తలు ఆదివారం ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు జడ్పిటిసి తిర్మల్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి తెలిపారు. మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు శంకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నల్లపు శ్రీనివాస్, కో ఆప్షన్ మెంబర్ షమీ, పట్టణాధ్యక్షుడు నయీమ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బాల్ నర్సుతో పాటు పలువురు పార్టీలో చేరారు.