byసూర్య | Mon, Apr 29, 2024, 01:13 PM
బిజెపి హయాంలోనే నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందాయని పార్టీ అయిజ మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ పేర్కొన్నారు. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని ఈడిగోనిపల్లి గ్రామంలో ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నుంచి ఉపాధి కూలీలకు నేరుగా వేతన సాయం అందుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటేష్ యాదవ్, బీమ్ సేన్ రావు, లక్ష్మణ్, నరసింహులు, ఉరుకుందు తదితరులు పాల్గొన్నారు.