byసూర్య | Mon, Apr 29, 2024, 01:11 PM
ధన్వాడ మండలం హనుమాన్ పల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి డీకే ఆరుణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని అన్నారు. గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపిటిసి ఉమేష్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.