byసూర్య | Mon, Apr 29, 2024, 01:07 PM
నారాయణపేట మండలం శాసన్ పల్లి గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధికి అండగా నిలవాలని కోరారు. దేశానికి ప్రధానిగా రాహుల్ గాంధీని చేసేందుకు అందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, ఎంపీగా వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని కోరారు.