byసూర్య | Mon, Apr 29, 2024, 12:31 PM
చికాగో అమరులు చిందించిన నెత్తుటి సాక్ష్యం మేడే అని, అమరుల ఆశయ సాధనకై పోరాడుదామని ఏఐటీయూసీ నల్గొండ జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం కొండమల్లేపల్లిలో మేడేకు సంభందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే 1న వాడవాడలా కార్మిక జెండా రెపరెపలాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు వెంకటరాములు, వెంకటయ్య, సోమ్ల, శంకర్, హతిరాం, నందు తదితరులు పాల్గొన్నారు.