byసూర్య | Mon, Apr 29, 2024, 12:28 PM
మూడోసారి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు పార్టీ శ్రేణులు, అభిమానులు విశ్రమించవద్దని సైదిరెడ్డి కోరారు. కనగల్ మండల కేంద్రంలో ఎన్నిక ప్రచారం నిర్వహించారు. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన అభ్యర్థి కనీసం ఐదేళ్ల కాలంలో ఒకసారి కూడా ఇక్కడికి రాకపోవడమే కాకుండా ఏనాడు ప్రజల గురించి పట్టించుకోలేదన్నారు. తనను గెలిపిస్తే కనగల్ నుంచి దేవరకొండ వరకు నాలుగు వరస రహదారితో పాటు కనగల్ మైలసముద్రంకు ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ నుంచి ప్రత్యేక కాలువ ఏర్పాటు చేసి చెరువు నింపే విధంగా కృషి చేస్తామన్నారు. మూడు సంవత్సరాల్లోనే జిల్లాలో 50 వేలమంది నిరుద్యోగులకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అనంతరం అక్కడి వ్యాపారులను ఓట్లు అభ్యర్థించారు.