byసూర్య | Sun, Apr 28, 2024, 10:54 AM
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని చిలుకూరు గ్రామ శాఖ కాంగ్రెస్ నాయకులు నిడమానూరు వంశీ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం మండల కాంగ్రెస్ నాయకులు శనివారం వారితో చర్చించి తిరిగి పార్టీలో కొనసాగాలని సూచించారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు తన రాజీనామాను ఉపసంహరించుకొని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు.