byసూర్య | Tue, Apr 23, 2024, 04:19 PM
నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అంటేనే స్కాములు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. కేవలం దోచుకోవడం దాచుకోవడమే తప్ప చేసింది, చేయబోయేది ఏమి లేదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నల్గొండలో కేవలం కుటుంబ పాలన మాత్రమే నడుస్తుందంటూ ఉత్తం కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, జానా రెడ్డి ఫ్యామిలీ పై ఫైర్ అయ్యారు. కుటుంబ పాలనకు చరమగీతం పడాల్సిన టైం వచ్చిందని, మోడీ పాలనలోనే ప్రజలు సంతోషంగా ఉండబోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు.