byసూర్య | Tue, Apr 23, 2024, 04:22 PM
మోండా మార్కెట్ టకార బస్తీలోని అశోక యువజన సంఘం మంగళవారం నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాలను సికింద్రాబాద్ శాసనసభ్యుడు, బీఆర్ఎస్. ఎంపీ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామూహికంగా నిర్వహించే అన్ని మతాల ఉత్సవాలను పరస్పరం ఆనందోత్సవాలతో నిర్వహించుకోవడం జంట నగరాల ప్రత్యేకత అని అన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ విగ్రహానికి పద్మారావు గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.