byసూర్య | Tue, Apr 23, 2024, 03:37 PM
హైదరాబాద్లో దారుణమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పల్లో ఓ యువకుడు అతివేగంతో బైక్పై వెళ్తూ కింద జారిపడ్డాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు అతడిపై నుంచి దూసుకుపోవడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై దర్యాప్తు చేపట్టారు.