byసూర్య | Tue, Apr 23, 2024, 12:20 PM
చొప్పదండి మండలం రుక్మాపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్వహణ కమిటి అధ్యర్యంలో చేపట్టిన హరినామ సంకీర్తనలు రాష్ట్ర స్థాయి భజన పోటీలలో కేశవపట్నం గ్రామానికి చెందిన శివకేశవ భజన మండలి సభ్యులు పాల్గొని ద్వితీయ బహుమతి పొందారు. ఈ పోటిలలో వివిధ జిల్లాల నుంచి 20కి పైగా భజన బృందాలు పాల్గొన్నాయి. ఉత్తమ ప్రతిభ కనబరచి బహుమతి పొందటంతో మండలానికి చెందిన భజన ప్రియులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.