byసూర్య | Tue, Apr 23, 2024, 12:17 PM
మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే మండలం వన్నారంకి చెందిన తాళ్లపల్లి సంపత్ అనే గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుడు పనిమీద ద్విచక్ర వాహనంపై గట్టుదుద్దెనపల్లికి వచ్చి తిరిగి వెళ్తుండగా కరీంనగర్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ బైక్ ను ఢీకొట్టింది. సంపత్ ఎడమ కాలుకు తీవ్ర గాయమై రక్తస్రావం కాగా 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.