byసూర్య | Tue, Apr 23, 2024, 12:10 PM
హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇప్పల్ నర్సింగాపూర్ లో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడిచేశారు. పక్కా సమాచారంతో సీఐ రమేష్ ఆదేశాల మెరకు ఎస్ఐ, సిబ్బందితో వెళ్లి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 33, 310 లు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసుకున్నారు. అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై చట్టారీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.