byసూర్య | Tue, Apr 23, 2024, 11:42 AM
నారాయణపేట పట్టణంలోని ఆశోక్ నగర్ వీధిలో వెలసిన మలలాంబిక దేవి మంగళవారం ఆంజనేయ స్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ ఆంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు కృష్ణ అమ్మవారిని ఆంజనేయ స్వామి అవతారంలో అందంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, మంగళ హారతులు చేసి నైవేద్యాన్ని సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకొని పూజలు నిర్వహించారు.