byసూర్య | Tue, Apr 23, 2024, 11:35 AM
మహబూబ్ నగర్ నుంచి బోధన్ (నిజామాబాద్ జిల్లా) మధ్య నడిచే రైలును ఈనెల 16వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా రద్దు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు ఈ రైలు రాకపోకలు నిలిపివేసినప్పటికీ తాజాగా మే 1 నుంచి 16 వ తేదీ వరకు రద్దును పొడిగించినట్లు ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు.