byసూర్య | Tue, Apr 23, 2024, 11:31 AM
ప్రభుత్వ వైద్య కళాశాలలో గౌరవ వేతన పద్ధతిపై 15 సీనియర్ రెసిడెంట్, ఒక ట్యూటర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్, కళాశాల ప్రిన్సిపల్ పార్వతి పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 27న ఉ. 10 గంటలకు గద్వాల జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని పర్యవేక్షక ఛాంబర్ లో ఇంటర్వ్యూలు హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు www. telangana. jogulambagad- wal. gov. in వెబ్ సైట్ లో సందర్శించాలన్నారు.