byసూర్య | Tue, Apr 23, 2024, 11:29 AM
నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో మంగళవారం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కనున్నాయి. ఎంపీ అభ్యర్థులు ఇప్పటికే ఆయా అసెంబ్లీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే 23న నాగర్ కర్నూల్ లో జరిగే బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. 27న రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొంటారు. దీంతో స్థానిక నేతలు జనసమీకరణలో నిమగ్నమైయ్యారు. ఎంపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు ముందుకెళ్తున్నారు.