byసూర్య | Tue, Apr 23, 2024, 11:28 AM
నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డా. మల్లు రవి నామినేషన్ సందర్భంగా బిజినపల్లి మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం 3: 00 గంటలకు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేద్దామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా kరెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.