byసూర్య | Tue, Apr 23, 2024, 11:25 AM
శానంపూడి సైదిరెడ్డి ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే నల్లగొండలో ఫుడ్ ప్రాసెసింగ్ కారిడార్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నల్గొండలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ కారిడార్ వస్తే జిల్లాలో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు.