byసూర్య | Tue, Apr 23, 2024, 11:23 AM
ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హాలియాలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బహిరంగ సభకు హాజరై మాట్లాడుతూ నల్గొండ ఎంపీగా రఘువీర్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు జయవీర్, బాలు నాయక్, లక్ష్మారెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘువీర్ తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.