byసూర్య | Tue, Apr 23, 2024, 10:58 AM
జిన్నారం మండల కేంద్రంలో మంగళవారం హనుమాన్ జయంతి ఉత్సవాలను హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ఘనంగా నిర్వహించారు. స్థానిక హనుమాన్ ఆలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కాషాయ జెండాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. హనుమాన్ నినాదాలతో విధులను మార్మోగిపోయాయి. భక్తిలో మునిగిన యువత ఉత్సాహంగా నృత్యాలు చేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.