byసూర్య | Tue, Apr 23, 2024, 10:33 AM
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోగల 1వ, వార్డు జగన్నాథ రావు కాలనీలో సిసి రోడ్ నిర్మాణ పనులను మంగళవారం మున్సిపల్ చైర్మన్ దుర్గాప్ప గారి అశోక్ గౌడ్ పరిశీలించారు. అనంతరం వార్డు సమస్యలను కాలనీవాసులతో అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అదేవిధంగా నీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.