byసూర్య | Mon, Apr 22, 2024, 12:02 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ మెట్కాన్ గూడ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బిఆర్ఎస్ నాయకులతో కలిసి డివిజన్ గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరి పాదయాత్ర చేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి ఇంటింటికి తిరుగు బిఆర్ఎస్ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని స్థానిక ప్రజలను కోరారు. గతంలో చేసిన అభివృద్ధి పనులే బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తాయని వారు తెలిపారు.