ఆ పని చేస్తుండగా చూశాడని బాలుడి హత్య.. ఆ తర్వాత నేరం ఒప్పుకుని

byసూర్య | Sun, Apr 21, 2024, 07:25 PM

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనం చేస్తుండగా చూసి సాక్ష్యం చెప్పినందుకు.. 13 ఏళ్ల బాలుడిని అత్యంత దారుణంగా హత్య చేసి.. ఆ తర్వాత చేసిన నేరం ఒప్పుకుని అందరూ చూస్తుండగానే తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. జోగిపేటకు చెందిన నాగరాజు అనే యువకుడు దొంగతనం చేస్తుండగా శేఖర్ అనే 13 ఏళ్లు బాలుడు చూశాడు. దీంతో శేఖర్ మీద కక్ష పెంచుకున్న నాగరాజు.. ఆదివారం (ఏప్రిల్ 20న) రాత్రి మాట్లాడాలని పిలిచి బాలుడిని హత్య చేసి బావిలో పడేశాడు.


ఉదయం పోలీసులకు ఫోన్ చేసి నేరం ఒప్పుకున్నాడు. శేఖర్ మృతదేహాన్ని బావిలో పడేసిన విషయాన్ని కూడా పోలీసులకు చెప్పాడు. ఈ విషయం తెలిసి.. తనను చంపుతారని భయపడి.. నాగరాజు సెల్ టవర్ ఎక్కాడు. అడ్డుకోవడానికి వెళ్లిన మరో ఇద్దరిపై కూడా కత్తితో దాడి చేసి టవర్ ఎక్కాడు నాగరాజు. ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం నుంచి సెల్ టవర్‌పైనే ఉన్నాడు. టవర్‌పైనే ఓ కేబుల్ కట్ చేసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. టవర్ మీద నిందితుడు ఉలుకు పలుకు లేకపోవడంతో డ్రోన్ కెమెరాతో నాగరాజు కదలికలు గమనించిన పోలీసులు.. చనిపోయాడని తెలుసుకుని మృతదేహాన్ని కిందికి దింపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే నాగరాజు బంధువులు ఆందోళనకు దిగారు. మరోవైపు.. బాలుడు శేఖర్ మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో.. గ్రామంలో విషాదఛాయలు అముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.


Latest News
 

'కేసీఆర్ కుటుంబంలో లొల్లి షురూ.. ఆయన వస్తే మాత్రం కేటీఆర్, హరీష్ పక్కా జైలుకే. Sun, Sep 22, 2024, 10:06 PM
డీజేలను బ్యాన్ చేయాలి.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ Sun, Sep 22, 2024, 10:04 PM
ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM