byసూర్య | Sat, Apr 20, 2024, 12:34 PM
కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ ఎస్ఓటి, సనత్నగర్ పోలీసులు సంయుక్తంగా సనత్నగర్ పీఎస్ పరిధిలోని ఎర్రగడ్డ భరత్నగర్ ఫ్లై ఓవర్ వద్ద శనివారం బచ్చల లోకేష్ అనే శ్రీకాకులానికి చెందిన యువకుడిని పట్టుకుని అతని వద్ద నుండి 57, 500 విలువ గల 2. 3కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఏపీ చెందిన వ్యక్తి, జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చి మోతీనగర్లో నివాసం ఉంటూ ఇంటి నిర్మాణ పని చేస్తున్నాడని తెలిసింది.